Wednesday, May 30, 2012

భక్తి అంటే ఏమిటి?

అఙ్కోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా
సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధుస్సరిద్ వల్లభమ్
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే - 61

-- శివానందలహరి

భక్తి అంటే ఏమిటి?
శంకర భగవత్పాదులు ఇలా అంటారు. "మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే" (మోక్ష కారణలైన సామాగ్రులలో "భక్తి"  గొప్పది.  "స్వస్వరూప అనుసంధానమే" భక్తి అనబడుతుంది)

తన నిజ స్వరూపంతో విడదీయలేనట్లుగా కలిసి పోవడమే భక్తి. పై శ్లోకంలో ఇదే భావాన్ని శంకరులు శివానందలహరిలో చక్కగా ఉదాహరణలతో గొప్ప  యోగరహస్యాన్ని చొప్పించి మరీ చెప్పారు.
1. అంకొల వృక్షము యొక్క బీజములు చెట్టుచే ఆకర్షింపబడి నట్లుగా
2. అయస్కాంతము చేత సూది (అయస్కాంత క్షేత్రములోకి వచ్చిన వెంటనే చటుక్కున అతుక్కుపోయినట్లుగా)
3. సాధ్వి ఎల్లప్పుడూ తన విభుని చేరునట్లుగా (సాధ్వి అలోచనలు ఎల్లప్పుడూ తన విభునియందే ఉండునట్లుగా)
4. లత (పూలతీగ) చెట్టుని పెనవేసుకున్నట్లుగా
5. నదులు తమ వల్లభుడైన సముద్రములో లీనమైనట్లుగా (నామ రూపాలను వదలి)
చిత్త వృత్తులు పరమేశ్వరుని పాదారవింద ద్వయమునందు చేరి ఎల్లప్పుడూ ఉంటవో దానినే భక్తి అందురు.

ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తులనీ ; ఈ చిత్త వృత్తుల నిరోధమే "యోగ" మనబడుతుందనీ పతంజలి మహర్షి యోగ సూత్రం. అదే భక్తి అనబడుతుందని శంకరుల వివరణ. ఇలాంటి భక్తి వలననే మానవుడు తరిస్తాడు.

ఓం తత్సత్

Sunday, May 20, 2012

సహజ భూషణములు

యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనామ్ 
ఉద్యమః శత్రుహననం భూషణం భూతిమిచ్ఛతామ్.

--శ్రి దేవీ భాగవతం పంచమ స్కంధం పంచమాధ్యాయం నుంచి ఇంద్రుడు దేవగురువైన బృహస్పతితో

యతులకు (సన్న్యాసాశ్రమములోఉన్నవారికి) జ్ఞానము భూషణము. సంతోషము ద్విజులకు (బ్రహ్మణులకు) భూషణము. సంపదలను కోరు వారికి (క్షత్రియులకు) శత్రు హనన ప్రయత్నము భూషణము.

Tuesday, May 15, 2012

ఉయ్యాల

అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు జేసె నీ వుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశ పద మడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తొఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల

మేలు కట్లయిమీకు మేఘ మండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీల శైలము వంటి నీ మేని కాంతికిని నిజమైన తొడవాయ నుయ్యాల

పాలిండ్లు కదలఁగాఁ పయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన వూఁచి రుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ముఁ గౌఁగిలింపఁగఁజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయ మూర్తి వేంకట శైల పతి నీకు కడు వేడుకై యుండె నుయ్యాల

--గొప్ప యోగ రహస్యాన్ని భక్తి శృంగార రసాలతో మేళవించి అన్నమాచార్యుల వారు అనుభవించి చెప్పిన కీర్తన
--అపర ఏకాదశి, అచల ఏకాదశి సందర్భంగా

uyyAla 

What is this UyyAla? why the Lord is put on a swing in Unjal Seva?
The secret of this swing is given by AnnamAcharya in this kIrtana.

Lord exists in all the beings who are of continuous moving nature. HE exists in the uchhvasa - inhaling and exhaling air in the process of breathing. That is symbolized as the swing in which the Lord stays unmoving. The east and west (the directions of sunrise and sunset) are considered as the supporting pillars for this swing which bears the whole universe. The space is considered the top beam on which the swing is hanging. Vedas are the ropes and the Dharma is the seat - The great swing which is beyond all the descriptions is the uyyAla of Lord.

This swing gently swings as if the world gets disturbed if pushed harshly... The godess of wealth (God of the movable property!) and the godess of earth (God of the immovable property!) sridevi i.e, kamala and bhUdevi i.e., bhusati embrace the Lord in each oscillation of this swing. (so they always belong to Lord; never assume any properties belongs to individuals... only as long as the breath moves, Ahamkaara i.e, ego falsely thinks that it owns some property.)

What can we say about this swing? Even for divine beings starting from the creator Brahma, it is a festive sight to see this uyyAla of Lord SrI Venkateswara..

--  Great yoga secret garnished with bhakti and sRngAra rasas by annamAcarya,
-- On the occasion of achala EkaDasi, apara Ekadasi

Wednesday, May 9, 2012

జడత్వం ఎక్కడుంది?

భగవత్పాదులు ఆది శంకరులు ఆర్యాంబ గర్భమునదు ఎందుకు ఉదయించారు? అంతటి మహాపురుషునికి జన్మనిచ్చే భాగ్యం కలగడనికి కావలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం శంకర విజయం లో దొరికింది.

ఆర్యాబ శివగురు దంపతులకు చాలాకాలం సంతాన ప్రాప్తి కలగక పోవడంతో శివగురు చింతిస్తూన్న తరుణంలో ఆర్యాంబ "ఉపమన్యు" వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి "నో దేవతాసు జడిమా, జడిమా మనుష్యే" అని తన భర్తకు విన్నవిస్తుంది.

ఉపమన్యు వృత్తాంతాన్ని టూకీగా ఇలా చెప్పుకోవచ్చు. ఊపమన్యువు బాల్యంలో తోటి పిల్లలందరూ పాలు తాగి తన బీదరికాన్ని హేళన చేయగా తన తల్లి వద్దకు వచ్చి పాల కొరకు పట్టు పడతాడు. ఆ రోజులలో పేదవారు ఆవులను పెంచలేక పోవటం వలన పాలు సులభంగా లభించేవి కాదు. ఆందువలన ఉపమన్యు ను తల్లి పిండి నీటిలో కలిపి తన పిల్లవానికి పాలుగా ఇచ్చింది. ఉపమన్యువు తాను కూడా పాలు తాగానని తన సహచరులతో చెప్పగా వారు అతను తాగినవి పాలు కావనీ, పిండి నీళ్ళనీ గ్రహించి ఎక్కువ హేళన చేయసాగిరి.

ఉపమన్యు తన తల్లి వద్ద సత్యాన్ని కనుగొని తనకు నిజమైన పాలు లభించడానికి పరమశివునిగూర్చి ఒక శివ ప్రతిమను ఉద్దెశించి శ్రద్ధగా తపస్సు చేయసాగెను.. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఉపమన్యుకు క్షీర సముద్రాధిపత్యమునిచ్చెను.

"దేవతలు రాతి విగ్రహములుగా నున్ననూ వానియందు జడత్వము లేదు. దేవతా స్వరూపమును గ్రహింప జాలని మనుష్యునియందే జదత్వము గలదు" అని ఆర్యాబ శివగురు తో విన్నవించగా వారిరువురూ వృషాద్రీశ్వరుణ్ణి గూర్చి తపమొనర్చగా ఈ "ఆస్తిక్యమునకు" మెచ్చిన పరమేశ్వరుడు ఆర్యాంబాశివగురు దంపతులననుగ్రహించి శంకర భగవత్పాదులుగా అవతరించారు.

--వైశాఖ బహుళ చవితి  (ఆస్తిక్యానికి ఎంతొ ప్రాధాన్యతనిచ్చిన మా అమ్మ ను తలుచుకుంటూ)