Showing posts with label దాంపత్యం. Show all posts
Showing posts with label దాంపత్యం. Show all posts

Tuesday, March 8, 2022

శివ పద మణి మాలా

శివేతి ద్వౌ వర్ణౌ పర పద నయత్ హంస గరుతౌ

తటౌ సంసారాబ్ధేః నిజ విషయ బొధాంకుర దలే

శృతేః అంతః గోపాయిత పర రహస్యౌ హృది చరౌ 

ఘరట్ట గ్రావాణౌ భవ విటపి బీజౌషు దలనే 


శివ పద మణి మాలా - శ్లోకం 1


SivEti dvau varNau para pada nayat hamsa garutau

taTau samsArAbdhE@h nija vishaya bodhAnkura dalE

SRtE@h anta@h gOpAyita para rahasyau hRdi charau 

gharaTTa grAvANau bhava viTapi bIjaushu dalanE 


Siva pada maNi mAlaa - SlOkam 1

For one hour long monologue: https://youtu.be/-s18yE4K-Sc


Wednesday, October 17, 2018

ధర్మానికి పునాది - దాంపత్యం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి  .. ఏష ధర్మః సనాతనః 195 ఎంతో ఉపయోగ కరమైన ధార్మిక వ్యాసాల సంకలనం. 

ధర్మానికి పునాది - దాంపత్యం అనే వ్యాసంలో "భార్యా దైవకృతా సఖా" అనీ "భార్యా శ్రేష్ఠతమా సఖా" అనీ శృతి చెప్పిన విషయాలు చెప్పబడ్డాయి.

ఇంకా మనుస్మృతి:
అర్థస్య సంగ్రహే చైనాం వ్యయే చైవ నియోజయేత్ శౌచే ధర్మేన్నపక్వాంచ పారిణాహ్యస్యచేక్షణే 

అంటే, "ఆర్జించిన ధనాన్ని రక్షించటంలోనూ వ్యయం లోనూ, గృహం లో శౌచ సదాచార ధర్మాల్లోనూ ఆహార విషయంలోనూ గృహిణీయే అధికారిణి" అని చెప్పారు. 

అందుకని, దాంపత్యమే ధర్మానికి పునాది. 

పూర్తి వ్యాసం: (ఎవరైనా కాపీరైటు ఉల్లంఘన గా భావిస్తే తెలియజేయండి - స్కానులను తొలగిస్తాము)






అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభా యథా అని శ్రీ రామ చంద్ర మూర్తి శ్రీ రామాయణం లో చెప్పినట్లుగా అనన్యా హి మయా శోభనా భాస్కరస్య ప్రభా యథా! 





Sunday, April 10, 2011

అన్యోన్య దాంపత్యం

వరుడు:
హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే
వధువు:
నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఇలా వధూవరుల స్వరూపాలు పరస్పర విరుద్ధంగా ఉన్నా "ఆది దంపతులు" ఎలా విడదీయలేకుండా ఉంటారో మహాకవి కాళిదాసు మాటల్లో:
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
యౌ: ఎవరు, వాగర్థావివ: శబ్దార్థములవలె, సంపృక్తౌ: కలిసియుండిరో, జగతః జగతికి, పితరౌ: తలిదండ్రులో, తౌ : ఆ, పార్వతీ పరమేశ్వరౌ : పార్వతిని పరమేశ్వరుని, వాగర్థ ప్రతిపత్తయే : శబ్దార్థములను సరిగా ఎరుగుటకు, వందే : నమస్కరించుచున్నాను.

అలాంటి అన్యోన్య దంపతులు లోకానికి మేలు జరగడం కోసం ఎలా ప్రవర్తిస్తారో పోతన భాగవతం లో:
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ మంగళ సూత్రమ్ము నెంతమది నమ్మినదో
ఈ పద్యం లో ముఖ్యంగా క్రింది విషయాలని గమనించాలి.
1. హాలాహలాన్ని వామ హస్తం లో గ్రహించిన శివుడు పార్వతి ఆమోదం కొరకు చూడటం
2. పార్వతీ దేవికి భర్త మీద (మంగళ సూత్రం మీద) గల నమ్మకం
3. ప్రజా హితమైన కార్యం కోసం త్యాగం చేయగలగడం

-- ప్రతీ దంపతుల జంటా ఈ "ఆది దంపతులను" ఆదర్శంగా తీసుకుని జీవిస్తే జగత్తుకు ఎల్లప్పుడూ సర్వ మంగళమే జరుగుతుంది.