శ్రౌతస్మార్తపథే పరాఙ్ముఖమపి ప్రోద్యన్మహాపాతకం
విశ్వాతీతమపత్యమేవ గతిరిత్యాలాపయంతం సకృత్ .
రక్షన్ యః కరుణాపయోనిధిరితి ప్రాప్తప్రసిద్ధిః పురా
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః
https://sanskritdocuments.org/doc_shiva/ArttatrANastotram.html
ఉన్న నిజాన్ని పెద్దలు రక రకాలు గా చెప్పారు - వారి మాటల్లోనే కొంత ఈ బ్లాగు లో....
శ్రౌతస్మార్తపథే పరాఙ్ముఖమపి ప్రోద్యన్మహాపాతకం
విశ్వాతీతమపత్యమేవ గతిరిత్యాలాపయంతం సకృత్ .
రక్షన్ యః కరుణాపయోనిధిరితి ప్రాప్తప్రసిద్ధిః పురా
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః
https://sanskritdocuments.org/doc_shiva/ArttatrANastotram.html
బ్రహ్మైవాహం శివో హం విభురహమమలశ్చిద్ఘనోఽహం విమాయః
సోఽహం హంసస్స్వతన్త్రస్తదహమతిజరః ప్రజ్ఞయా కేవలోఽహమ్ ।
ధ్యేయధ్యాతృప్రమాణై: గలితమతిరహం నిశ్చలోఽహం సదేత
ప్రాజ్ఞా యచ్చిత్సభాయామతిశయమభజత్ కుఞ్చతాఞ్ఘ్రిం భజేహమ్ ||242
నేను బ్రహ్మను, నేను శివుడను, నేను విభువును, పాపం లేనివాడను, చిద్ఘనుడను, మాయారహితుడను, హంసస్వరూపుడను, స్వతంత్రుడను, వార్ధక్యంలేని వాడను, కేవలం ప్రజ్ఞతో కూడినవాడను, ధ్యేయం, ధ్యాత, ప్రమాణం - అనే వీనికి అందనివాడను, సదా నిశ్చలుడను అని ప్రాజ్ఞులు ఏ పరమేశ్వరుని చిత్సభలో ఆనందాతిశయాన్ని పొందుతారు. అటువంటి, కుంచితాఞ్ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను.
--- ఉమాపతి శివ విరచితమ్ ( శ్రీ క్రొధి నమ సంవత్సర భొగి, పుష్య పూర్ణిమ, ఆరుద్రా నక్షత్రమ్, సోమవారం )
ముగ్ధనాయిక పారవశ్యము
ఉ॥ పానుపుఁ జేరినంతఁ బతిప్రక్కను నీవిక జాఱి (వల్వయుం దానట మేఖలాగుణధృతంబయి నిల్చె నితంబ మం దటన్) మేనతఁ డంట, నాతఁడని, నేనని, యిట్టిది కేళి యంచు, నే మైనను భేదమే యెఱుఁగ నంగన! యంగజు మాయ యెట్టిదో!
శ్రీ తాళ్ళపాక తిరువెంగళప్ప శృంగార అమరు కావ్యము 31 ( సంస్కృత మూలం 97 )
ఇందులో త్రిపుటి లీనమయ్యే భావన స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే సంస్కృత మూలంలో:
कान्ते तल्पमुपागते विगलिता नीवी स्वयं तत्क्षणाद् तद्वासः श्लथमेखल गुणधृत्तं किंचिन्नितम्बे स्थितम् ।
एतावत्सखि वेद्मि केवलमहं तस्याङ्गसङ्गे पुनः कोऽमै कास्मि रतं तु किं कथमिति स्वत्पापि मे न स्मृतिः ॥९७॥
-- Amaru kaavyam 97
In yogic paralance this is known as triputi layam by the jeeva, who is the mugdha nAyika. This Telugu kavyam was dedicated to Lord Venkateswara by the poet.
శివేతి ద్వౌ వర్ణౌ పర పద నయత్ హంస గరుతౌ
తటౌ సంసారాబ్ధేః నిజ విషయ బొధాంకుర దలే
శృతేః అంతః గోపాయిత పర రహస్యౌ హృది చరౌ
ఘరట్ట గ్రావాణౌ భవ విటపి బీజౌషు దలనే
శివ పద మణి మాలా - శ్లోకం 1
SivEti dvau varNau para pada nayat hamsa garutau
taTau samsArAbdhE@h nija vishaya bodhAnkura dalE
SRtE@h anta@h gOpAyita para rahasyau hRdi charau
gharaTTa grAvANau bhava viTapi bIjaushu dalanE
Siva pada maNi mAlaa - SlOkam 1
For one hour long monologue: https://youtu.be/-s18yE4K-Sc
తవ మంత్రకృతో మంత్రైర్దూరాత్ప్రశమితారిభిః .
ప్రత్యాదిశ్యంత ఇవ మే దృష్టలక్ష్యభిదః శరాః .. 1-61..
--రఘువంశం - 1 వ సర్గ, 61వ శ్లోకం
ఇవి దిలీప చక్రవర్తి వశిష్ఠ మహర్షితో అన్న మాటలు.
సనాతాన యజ్ఞ సంస్కృతి లో దేశాన్ని పరిపాలించే రాజులు, ఋషుల మంత్ర శక్తి తో అతీంద్రియమైన శక్తిని పొందేవారు.
శత్రువులు రెండు రకాలు. 1. బాహ్యం గా కనిపించే శత్రువులు 2. అంతరంగా కనిపించకుండా రాజ్యానికి అపకారం చేసే (దూర శత్రువులు)
బాహ్య శత్రువులను జయించడానికి అస్త్రాలు అవసరమైతే, సూక్షమైమన శత్రువులను శాంతింపజేయడానికి మంత్రశక్తి తో కూడిన శస్త్రాలు, వాటి ప్రయోగం తెలిసిన పురోహితులు అవసరమవుతారు.
పైన చెప్పిన శ్లోకానికి అర్థం ఇలా చెప్పుకోవచ్చు:
ఓ మహర్షీ! మీ మంత్రములతో దూరమునుంచే శాంతింపబడిన సూక్ష్మ శత్రువులు నివారించ బడుతున్నారు (నా రాజ్యం రక్షించ బడుతోంది) నా శరములు కనిపించే శత్రువులను మాత్రమే భేదిస్తున్నాయి.
ఇదీ యజ్ఞ సంస్కృతి. క్షాత్రం, బ్రాహ్మం సహాయంతో ప్రజా రక్షణ చేయాలి.